అక్షరటుడే, వెబ్డెస్క్ : Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్పూర్ (Nagpur) జిల్లాలోని ఒక పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించంగా.. 17 మంది మరణించారు.
కటోల్ తహసీల్లోని రౌల్గావ్లోని ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ (SBL Energy Limited) ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకుంది. కంపెనీ డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్లో ఈ ప్రమాదం జరగింది. తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
Maharashtra Factory Explosion | ఆస్పత్రికి తరలింపు
కలెక్టర్ విపిన్ ఇటాంకర్, పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పోదార్తో సహా స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన 18 మందిని వెంటనే చికిత్స కోసం నాగ్పూర్లోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులను గుర్తించడానికి, వారి కుటుంబాలకు తెలియజేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలోని ఒక బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం పేలుడు చోటుచేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
Maharashtra Factory Explosion | ప్రధాని విచారం
మహారాష్ట్ర పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని తెలిపారు.
విషాదకరం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. చాలా దురదృష్టకరం, విషాదకరం అని అభివర్ణించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటనా స్థలంలో సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

దీనిని కూడా చదవండి : Kakinada Fireworks Explosion | బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 20 మంది మృతి

