అక్షరటుడే, వెబ్డెస్క్: Free Bus Travel | రాష్ట్ర ప్రభుత్వం (State Government) దివ్యాంగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ జీవో జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. తెలంగాణ పరిధిలో ఎక్కడకు వెళ్లినా.. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఈ పథకానికి భారీ స్పందన వస్తోంది. అయితే ఈ పథకాన్ని తమకు వర్తింపజేయాలని దివ్యాంగులు కొంతకాలంగా కోరుతున్నారు.
Free Bus Travel | గతంలో పాస్లు
గతంలో దివ్యాంగులకు ప్రభుత్వం రాయితీ బస్పాస్లు ఇచ్చింది. ఆ పాస్ చూయిస్తే బస్సులో 50 శాతం రాయితీ టికెట్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) అమలుతో దివ్యాంగ మహిళలు దానిని వినియోగించుకుంటున్నారు. రాయితీ పాస్లు తీసుకోవడం మానేశారు. అయితే తమకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కొంతకాలంగా దివ్యాంగ పురుషులు కోరుతున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వీరికి ఫ్రీ బస్సు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Free Bus Travel | త్వరలో స్మార్ట్ కార్డులు
ప్రస్తుతం మహిళలకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు చూసిన తర్వాత కండక్టర్లు మహాలక్ష్మి టికెట్ ఇస్తున్నారు. మరి దివ్యాంగులకు ఎలాంటి గుర్తింపు కార్డు అడుగుతారో ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొనలేదు. సదరం సర్టిఫికెట్ అడిగే అవకాశం ఉంది. లేదంటే ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వవచ్చని సమాచారం. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కోసం త్వరలో స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. ఆధార్, ఓటర్ కార్డులకు బదులుగా కొత్తగా ఇచ్చే స్మార్ట్ కార్డు చూపితేనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు.
Free Bus Travel | టికెట్ ధరల తగ్గింపు
హైదరాబాద్ నగరవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి e-మెట్రో అక్, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ రేట్లు తగ్గించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి..: Arunachalam Train Services | రెగ్యులర్ సర్వీస్గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్ప్రెస్

