అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa Saves Land |హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలు, ఆయా శాఖల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ.. కబ్జా చెరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడుతోంది.
హైడ్రా అధికారులు తాజాగా ఐటీ కారిడార్లో 6.30 ఎకరాల భూమిని కాపాడారు. దీని విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పి లో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని జలమండలికి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలంలో కొందరు ఆక్రమణలు చేస్తూ వస్తున్నారు. కొన్ని షెడ్డులు కూడా వేసి కబ్జా చేశారు.
Hydraa Saves Land | జల మండలి ఫిర్యాదుతో..
జలమండలి (Jalamandali) నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిగా గుర్తించారు. ఆ భూమిని ఆక్రమించి కొంతమంది వేసిన షెడ్డులను సోమవారం తొలగించారు. మొత్తం 6.30 ఎకరాల జలమండలికి కేటాయించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
కాగా నగరంలో ఆక్రమణల విషయంలో హైడ్రా సీరియస్గా స్పందిస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు, పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడుతోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయాల విలువైన ప్రభుత్వ భూములను రక్షించింది. మరోవైపు నగరంలో చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది.
దీనిని కూడా చదవండి : Sajjanar Warning | బలవంతంగా రంగులు పూస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్

