అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Courier Parcel Missing | తాము పంపిన పార్శిళ్లను కొరియర్ సర్వీస్ సిబ్బంది (Courier Service Staff) తారుమారు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రెండో టౌన్లో ఫిర్యాదు చేశారు.
Courier Parcel Missing | నగరంలోని ఆర్ఆర్చౌరస్తా వద్ద..
స్థానిక రెండో టౌన్లో ఫిర్యాదు అందించిన అనంతరం బాధితుడు కెతావత్ వెంకట రాములు మాట్లాడుతూ.. గతనెల 12న ఖలీల్వాడి (Khalilwadi)లోని ఓ ప్రైవేట్ కొరియర్ ద్వారా తాను పార్శిల్ పంపానన్నారు. అందులో నాలుగు ట్యాబ్లు ప్యాకింగ్ చేసి కొరియర్ యజమానికి అందజేశామన్నారు. అయితే పార్శిల్ చేరాల్సి స్థలానికి వెళ్లలేదన్నారు. అయితే తాము విచారిస్తే సదరు కొరియర్ సిబ్బంది తన పార్శిల్ను మిస్ప్లేస్ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై హైదరాబాద్ (Hyderabad)లోని సదరు కొరియర్ బ్రాంచ్ మేనేజర్ను సంప్రదిస్తే సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని రెండో టౌన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Incharge Additional Collector | నిజామాబాద్ ఇన్ఛార్జి అదనపు కలెక్టర్గా దిలీప్ కుమార్

