అక్షరటుడే, వెబ్డెస్క్: Iran Israel Conflict | ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు పరసర్పం దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లోని అణు కేంద్రం (Nuclear Power Plant)పై ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇరాన్ రహస్యంగా చేపట్టిన అణు కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ దళాలు (IDF Forces) ప్రకటించాయి. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహై (Minzadehai)లో న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్పై దాడి చేసినట్లు పేర్కొన్నాయి. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పని చేస్తున్నట్లు సమాచారం. 2025లో అమెరికా ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరాన్ రహస్య ప్రాంతంలోకి అణు స్థావరాన్ని మార్చినట్లు సమాచారం. తాజాగా దానిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
Iran Israel Conflict | ఖచ్చితమైన సమాచారంతో..
తాము గతంలో అణుస్థావరాలను ధ్వంసం చేసినా ఇరాన్ తీరు మార్చుకోలేదని ఐడీఎఫ్ పేర్కొంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని రహస్య ప్రాంతంలో దాచినట్లు ఖచ్చితమైన సమాచారం రావడంతో దాడులు చేశామని తెలిపింది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరాన్కు చెందిన 300 క్షిపణి లాంచర్లపై తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.
Iran Israel Conflict | ఎవరున్నా వదిలిపెట్టం
ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader)గా ఎవరు ఉన్నా వదిలి పెట్టామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిపిన దాడుల్లో ఖమేనీని హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడిని సుప్రీం నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ స్పందించింది. సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా చంపేస్తామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాక్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి..: Lahore US Consulate Attack | లాహోర్లోని యూఎస్ కాన్సులేట్ పై దాడి

