అక్షరటుడే, వెబ్డెస్క్: Mulugu Irrigation Projects | ములుగు జిల్లా (Mulugu District)లో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, నిధుల వినియోగం, ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు వివరించారు.
ములుగు జిల్లాలో ప్రాజెక్ట్లను వేగంగా పూర్తి చేస్తామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Mulugu Irrigation Projects | రెండేళ్లలో..
ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గత నెలలో సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాజెక్ట్లపై మంత్రులకు పలు సూచనలు చేశారు. రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన బడ్జెట్ సిద్ధం చేయాలన్నారు. అవసరం అయిన నిధులను వేగంగా విడుదల చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. రైతులకు సాగు నీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Mulugu Irrigation Projects | సాగునీటిపై..
రాష్ట్ర ప్రభుత్వం (State Government) సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అన్ని ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని యోచిస్తోంది. అయితే నిధుల కొరతతో కొన్ని పనులు నిలిచిపోయాయి. ఆయా ప్రాజెక్ట్ల పనులు సైతం వేగవంతం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి..: Kavitha Arrest Narsingi | నార్సింగ్లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!

