అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress Meeting | కాంగ్రెస్ పార్టీని (Congress Party) సమష్టిగా ముందుకు తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Nizamabad Congress Meeting | విజయవంతంగా డీసీసీ అధ్యక్షులకు శిక్షణ..
ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) మాట్లాడుతూ గతనెల 21న ప్రారంభమైన శిక్షణ శిబిరంలో ఏఐసీసీ నాయకులు రాష్ట్ర మంత్రులు, మాజీ ఐఏఎస్ అధికారులు రోజుకొకరు చొప్పన శిక్షణ అందజేశారన్నారు. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొప్పుల రాజు, దామోదర రాజనరసింహ, సీతక్క (Seethakka) తమ ప్రజంటేషన్ ఇచ్చారన్నారు. అనంతరం ప్రొఫసర్ కోదండరాం, ప్రవీణ్ చౌదరి, ఇమ్రాన్ ప్రతాప్, కంచె ఐలయ్య, భూక్యా, మీరా, నిర్మల, సెంథిల్, సిస్టర్ లిజి, సలావుద్దీన్, శాంతా కుమారి ఇంకా ఇతర ప్రముఖులు వారి రంగాలకు సంబంధించిన వాటి గురించి శిక్షణ ఇచ్చారన్నారు.

Nizamabad Congress Meeting | చరక బహూకరణ..
అలాగే శిక్షణలో భాగంగా చరక ద్వారా దూది నుండి దారం తీయడం కూడా నేర్పించారని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. జిల్లా అధ్యక్షులను, కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించడం జరిగిందని, రెండూ కూడా సమాన హోదా కలిగినవిగా పరిగణించాలని, ఎవరి పరిధిలో వాళ్లు పనిచేసుకోవాలని అధిష్టానం సూచించడం జరిగిందని తెలిపారు. తొమ్మిదో రోజు డీసీసీ అధ్యక్షులందరూ నృత్యం చేస్తూ టీపీసీసీ చీఫ్ ద్వారా సర్టిఫికెట్లు తీసుకోవడం మరిచిపోలేమన్నారు. చివరిరోజు రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల కుటుంబాలతో ఫొటోసెషన్లో పాల్గొన్నారన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల

