అక్షరటుడే, కామారెడ్డి: Modified Silencers Action | అధిక సౌండ్ కలిగిన సైలెన్సర్ల వినియోగిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో దాదాపు 150 సైలెన్సర్లను బుధవారం రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు.
Modified Silencers Action | ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక శబ్దం కలిగిన సైలెన్సర్లతో విద్యార్థులు, వృద్ధులు, గర్భిణులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. ఆకస్మికంగా వచ్చే అధిక శబ్దం ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా దారితీసే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రోలర్తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగిందన్నారు.
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం నేరం
చట్టవిరుద్ధంగా మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం నేరమని ఏఎస్పీ తెలిపారు. ఇలాంటి వాహనాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నేరాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి వాహనదారు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పట్టణ ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వారిని ఏమాత్రం సహించబోమని.. అలాంటి వాహనాలను వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నరహరి, ట్రాఫిక్ ఎస్సై మహేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర

