అక్షరటుడే, వెబ్డెస్క్ : Nitish Kumar | బీహార్ (Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం నితీశ్కుమార్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడానికి అంతా సిద్ధం అయినట్లు సమాచారం. అయితే తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ మొదలైంది. నితీశ్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేయడానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని జనతాదళ్ యునైటెడ్ (JDU) వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు. మార్చి 5న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Nitish Kumar | మార్చి 16న రాజీనామా
నితీశ్కుమార్కు ఈ నెల 1న 75 ఏళ్లు నిండాయి. ఆయన ఈ నెల 16 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వరకు కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఎగువ సభకు వెళ్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

Nitish Kumar | సీఎంతో పలువురు భేటీ
సీఎం రాజీనామా ప్రచారం నేపథ్యంలో జేడీయూ నాయకులు సమావేశం అవుతున్నారు. మంత్రి విజేంద్ర ప్రసాద్ యాదవ్ కుమార్, మంత్రి అశోక్ చౌదరి సీఎంను కలిశారు. నితీశ్కుమార్ రాజ్యసభకు వెళ్తే.. బీజేపీ (BJP) సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది. నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇన్ని రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనను డిప్యూటీ సీఎం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

