అక్షరటుడే, భీమ్ గల్: Bheemgal Tiger Movement | నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం.. కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. కోనాపూర్ సెక్షన్ ఇనాయత్నగర్ బీట్ పరిధిలో పులి పాదముద్రలను అటవీ సిబ్బంది గుర్తించారు.
ఈ పాదముద్రలు మనాల సరిహద్దు వైపు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. పులి కదలికలను నిశితంగా గమనించేందుకు అటవీ ప్రాంతంలో మూడు చోట్ల నిఘా (ట్రాప్) కెమెరాలను ఏర్పాటు చేశారు.

Bheemgal Tiger Movement | అడవిలోకి వెళ్లవద్దు:
పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు, ముఖ్యంగా గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ అధికారి సూచించారు. ఎవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని, పశువుల మేత కోసం వెళ్లేవారు గుంపులుగా ఉండాలని కోరారు. అలాగే పొలాల వద్ద వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చవద్దని, అది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పులి జాడ కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

