అక్షరటుడే, వెబ్డెస్క్ : India Semi Final Win | టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు (India) మరోసారి తమ సత్తా చాటింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించింది. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతిని ఇచ్చింది. మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపిస్తూ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా ధైర్యంగా పోరాడింది. కానీ చివరికి 246 పరుగుల వద్దే ఆగిపోవడంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది.
India Semi Final Win | 25 రికార్డులు ఇవే..
ఈ మ్యాచ్లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ (Jacob) ప్రదర్శన. అతను కేవలం 19 బంతుల్లో అర్ధశతకం సాధించి టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ చేసిన 19 బంతుల ఫిఫ్టీకి సమానం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరఫున ఇదే వేగవంతమైన అర్ధశతకంగా కూడా బెథెల్ ఇన్నింగ్స్ నిలిచింది. ఇదే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేయడం కూడా ఒక రికార్డుగా నిలిచింది.
భారత్ తరఫున ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతూ 89 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో భారత్ తరఫున 50కి పైగా స్కోరు చేసిన ఓపెనర్ల జాబితాలో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత సంజూ శాంసన్ కూడా చేరాడు.
ఈ టోర్నమెంట్( India Semi Final Win )లో సంజూ శాంసన్ మరో రికార్డును కూడా తన పేరున నమోదు చేసుకున్నాడు. ఒకే ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ 47 మ్యాచ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
India Semi Final Win | అత్యధిక సిక్సర్లు
ఈ మ్యాచ్ హై-స్కోరింగ్ థ్రిల్లర్గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా నమోదైంది. భారత్–ఇంగ్లాండ్ మ్యాచ్లో మొత్తం 19 సిక్సర్లు నమోదయ్యాయి. అంతేకాదు ఒకే మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు బాదడం కూడా కొత్త రికార్డుగా నిలిచింది.
భారత్ చేసిన 253/7 స్కోరు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్లో 200కు పైగా స్కోరు నమోదవడం అరుదైన విషయం. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో ఇది రెండోసారి మాత్రమే జరిగింది.
బౌలింగ్ పరంగా కూడా కొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి నాకౌట్ మ్యాచ్లో ఖరీదైన స్పెల్ నమోదు చేశాడు. అలాగే భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసి 64 పరుగులు ఇవ్వడం కూడా ఖరీదైన స్పెల్గా నిలిచింది.
మొత్తంగా ఈ సెమీఫైనల్ Semi Final మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అనేక అరుదైన రికార్డులు నమోదయ్యాయి. మొత్తం కీలక రికార్డులు నమోదవడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. భారత్ ఈ విజయం (India Semi Final Win) ద్వారా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుని టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఇప్పుడు ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

