అక్షరటుడే, వెబ్డెస్క్: Divvela Madhuri Controversy | బిగ్బాస్ ఫేమ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) సతీమణి దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. మాధురి, శ్రీనివాస్ జంట సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా తిరుమల (Tirumala)లో దివ్వెల మాధురి చేసిన పనిపై భక్తులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దివ్వెల మాధురి, బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజలు ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో తనూజ పుట్టినరోజు వేడుకలను వీరు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను దివ్వెల మాదిరి తన ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్కడకు కేక్ తీసుకు వెళ్లడం నిషేధం. అయితే మాధురి, తనూజ మాత్రం కేక్ కట్ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
Divvela Madhuri Controversy | పవిత్రతకు భంగం
వీరు ఇద్దరు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని టీటీడీ అధికారులు (TTD Officers) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీటీడీ వీరిపైన తిరుమల పోలీసు (Tirumala Police)లకు ఫిర్యాదు చేసింది. తిరుమలలో మాధురి, తనూజ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ తెలిపింది. కొండపై ఇలాంటి వేడుకలపై నిషేధం ఉందని పేర్కొంది. వీరిపై ఇప్పటికే విజిలెన్స్కు ఫిర్యాదు అందిందన్నారు. కాగా తిరుమలలో తిరుమలలో వ్యక్తిగత వేడుకలు జరుపుకోవడంపై నిషేధం ఉంది. అలాగే కేక్లను కొండపైకి తీసుకు వెళ్లకూడదు. కానీ వీరు నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

