అక్షరటుడే, భీమ్గల్: Prajapalana Pragathi Pranalika | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో (Bheemgal Municipality) ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆరో వార్డులో (Public Welfare Scheme) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఆదేశాల (Telangana Government Program) మేరకు నేటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రత్యేక ప్రణాళిక అమలులో ఉంటుందని తెలిపారు.
Prajapalana Pragathi Pranalika | బహుళ లక్ష్యాలతో ముందుకు..
ఈ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల్లో పారిశుధ్యం, ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ నివారణ, రైతులకు అవగాహన, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఛైర్పర్సన్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో మురికి కాల్వల పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ వంటి పారిశుధ్య పనులను చేపట్టారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ఛైర్పర్సన్ సంటిలత నర్సయ్య, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajapalana Pragathi Pranalika | పంచాయతీల్లో..
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం (Municipal Administration India) భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టాల్సిన 99 రోజుల ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ ఆవరణలో పారిశుధ్య (సానిటేషన్) పనులను ప్రత్యేకంగా నిర్వహించారు. మురికి కాల్వల శుభ్రం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులను సర్పంచ్లు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ.. గ్రామాలను రోగరహితంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని, ప్రజలందరూ పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్ విడుదల

