అక్షరటుడే, వెబ్డెస్క్ : Heatwave Warning Telangana | భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తన ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతున్నాయి. రాత్రి కాస్తా చల్లాగా ఉంటున్నా.. పగటి పూట కాలు బయట పెట్టలేని పరిస్థితి.
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ (Telangana)లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని తెలిపారు. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితేనే మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలని సూచించారు.
Heatwave Warning Telangana | నీరు బాగా తాగాలి
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో నీరు ఎక్కువగా తాగాలి. దాహం వేయకపోయినా నీరు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. ఎక్కడికైనా బయటకు వెళ్తే వెంట నీరు తీసుకు వెళ్లాలి. జంక్ ఫుడ్లు (Junk Foods) తినొద్దు. మద్యం తాగకపోవడం మంచిది. సన్నని, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. బయటకు వెళ్లిన సమయంలో తలకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు ఉంటే వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
Heatwave Warning Telangana | ఇవి చేయొద్దు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దు. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, ఎక్కువ మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలు తాగొద్దు. ఎండదెబ్బ (Sun Stroke)కు గురైతే వికారం, వాంతులు వస్తాయి. వేడి కావడంతో పాటు చర్మం పొడి బారుతుంది. తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, మూర్ఛపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..: UPSC Results | సివిల్స్లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు

