అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ( Telangana welfare schemes) అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi scheme), షాదీ ముబారక్ చెక్కులను( Shaadi Mubarak scheme) పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో(Bomma Mahesh Kumar Goud) కలిసి అందజేశారు.
Shabbir Ali Welfare Priority | ఆడబిడ్డల వివాహాలు భారం కావొద్దని..
అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమం ప్రధాన సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని స్పష్టం చేశారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో అప్రతిహతంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కీలకమైన హామీలన్నింటినీ నెరవేర్చిందని ఆయన గుర్తు చేశారు.
Shabbir Ali Welfare Priority | మాటలు కావు.. చేతల ప్రభుత్వమిది..
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పడం కాదు.. చేతుల్లో చూపిస్తుందని (Telangana Congress government) పీసీసీ చీఫ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. వీటికి తోడు ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాల కల్పన, సన్న బియ్యం పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad Collector Inspection | మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

