అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Industrial Development |తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనుల పురోగతిపై సీఎస్ రామకృష్ణరావు (CS Ramakrishna Rao) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి కార్పొరేషన్ అమలు చేస్తున్న ప్రాజెక్టులపై ఆరా తీశారు.
జహీరాబాద్లోని ప్రతిపాదిత ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Smart City), వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (Textile Park), మెగా ఇండస్ట్రియల్ హబ్ల అభివృద్ధి, ఫార్మా క్లస్టర్లు, భారత్ ఫ్యూచర్ సిటీతో సహా అనేక ప్రధాన పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు, గ్రౌండింగ్ చేసిన ప్రాజెక్టుల సంఖ్యను అధికారులు వివరించారు.

Telangana Industrial Development |పెద్ద ఎత్తున ఉపాధి
జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ గురించి సీఎస్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కార్పొరేషన్ దృఢమైన, కేంద్రీకృత కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో పెద్ద ఎత్తున ఉపాధిని లభిస్తుందన్నారు. పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపు కోసం పారదర్శకంగా, ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంనద్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, TGIIC అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

