అక్షరటుడే, బాన్సువాడ: Nizamsagar Canal | మండల పరిధిలోని పులికుచ్చతండాకు చెందిన మూడ్ లలిత నిజాంసాగర్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Nizamsagar Canal | బంధువులతో జరిగిన గొడవలో..
సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బంధువు గోవిందుతో జరిగిన గొడవ విషయంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో పెద్దలు కూడా ఆమెను మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లలిత, పులికుచ్చ తండా శివారులో ఉన్న నిజాంసాగర్ ప్రధాన (Nizamsagar canal ) కాలువలో దూకింది. ఆమె ఆచూకీ కోసం గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెతుకుతుండగా (Banswada news) బీర్కూరు మండలం చించెల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్లో (Kamareddy district news) ఆమె మృతదేహం లభ్యమైంది.
గ్రామస్థులతో బెదిరింపు కారణంతోనే..
గ్రామస్థులతో జరిగిన గొడవ, వారి బెదిరింపుల కారణంగా భయపడి తన కుమార్తె కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ధారావత్ లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి: Damodar Rajanarsimha | ప్రైవేట్ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం

