అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Schools | ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల వారికి రవాణా ఖర్చులు భారంగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుందని సీఎం చెప్పారు.
Telangana Public Schools | నర్సరీ నుంచి 12వ తరగతి వరకు..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యావిధానం అమలు కాబోతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం తీసుకురావాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. తద్వారా చిన్నప్పటి నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నట్లు చెప్పారు.
Telangana Public Schools | తెలంగాణ పబ్లిక్ స్కూల్స్..
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ అనే నూతన బడులను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అందించనున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు.

