అక్షరటుడే, ఇందూరు: Godavari Pushkaralu 2027 | రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఘాట్ల వద్ద ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)కి లేఖ రాశారు.
Godavari Pushkaralu 2027 | నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో..
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్లకు కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎంపీ (MP Arvind Dharmapuri) తెలిపారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండనున్నందున ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Godavari Pushkaralu 2027 | ఘాట్ల అభివృద్ధి..రహదారుల విస్తరణ..
ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, అగ్నిమాపక సేవలు, విద్యుత్ సరఫరా, హైమాస్ట్ లైట్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన

