అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran Drone Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులతో ఆయా దేశాల్లో బాంబుల మోత మోగుతోంది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy)పై ఇరాన్ దాడి చేసింది.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్లోని ఖార్గ్ ఐలాండ్పై యూఎస్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఖార్గ్ ద్వీపం (Kharg Island)లోని సైనిక కేంద్రాల్ని నాశనం చేశామని ట్రంప్ ప్రకటించారు. చమురు మౌలిక సదుపాయాలపై దాడి చేయలేదని వెల్లడించారు. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద నౌకల రవాణాని అడ్డుకుంటే చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. యూఎస్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది.
Iran Drone Attack | పెద్ద ఎత్తున మంటలు
బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకొని దట్టమైన పొగ అలుముకుంది. ఈ దాడిని ఇరాక్ భద్రతా అధికారి, స్థానిక మీడియా ధ్రువీకరించాయి. ఇరాన్లోని కీలక చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపైం దాడులు, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఈ దాడులు చేసింది. ఖార్గ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామని (Donald Trump) ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా దాడుల్లో చమురు క్షేత్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి..: Mojtaba Khamenei Reward | మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్పండి.. రూ.92 కోట్ల బహుమతి గెలుచుకోండి.. అమెరికా సంచలన ప్రకటన

