అక్షరటుడే, వెబ్డెస్క్: GHMC Elections BJP | జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC elections) బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchander Rao) కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు.
GHMC Elections BJP | హైదరాబాద్ నగరానికి చెందిన..
హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం బీజేపీలో (BJP Hyderabad) చేరారు. వారికి రాంచందర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ పెద్ద ఎత్తున (Hyderabad politics) చేరికలు జరుగుతున్నట్లు ఆయన తెలిపాపారు. అంబర్పేట్కు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారన్నారు.
బీసీ వర్గాల్లో బలమైన గుర్తింపు ఉన్న గౌడ సంఘం ఛైర్మన్ గిరిధర్ గౌడ్, ప్రముఖ న్యాయవాది కవిత కాషాయ కండువా కప్పుకున్నారని చెప్పారు. వీరితో పాటు పెద్ద ఎత్తున యువకులు (BJP leaders join) పార్టీలో చేరారన్నారు.
GHMC Elections BJP | మార్పు కోరుకుంటున్నారు..
రాష్ట్రవ్యాప్తంగానే కాదు, హైదరాబాద్ మహానగరంలోనూ (Telangana BJP) ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల మధ్య నగరం నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి మారాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ మేయర్ను ఎన్నుకుంటేనే భాగ్యనగరం మరింత సురక్షితంగా మారుతుందన్నారు. అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. తెలంగాణలో రాజకీయ మార్పు తీసుకురావడానికి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి యువత, మహిళలు బీజేపీలో చేరాలని కోరారు.

ఇది కూడా చదవండి: Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్ పేరిట భూములు పంచుకునే యత్నం : కవిత

