అక్షరటుడే, కోటగిరి : Election Promises Protest | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం (State Government) వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కోటగిరి తహశీల్దార్ కార్యాలయం (Kotagiri Tahsildar Office) ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
Election Promises Protest | ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని వాటిలో ఏ ఒకటి కూడా అమలు చేయలేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్, కల్యాణ లక్ష్మి, రైతు భరోసా, వంటి హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతు భరోసా (Rythu Bharosa) రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండలంలోని దరఖాస్తు చేసుకున్న, వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళల పెన్షన్లు ఇప్పటివరకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరి, ఆలపాటి కోనేరు శశాంక్, సీనియర్ నాయకులు పుల్లల మోహన్రావు, శ్యామల, నాగెల్లి శ్రీనివాస్, జగదీష్, శ్యాం, మామిడి సాయిలు, ధవులయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Elderly Mother Complaint | కన్నోళ్లు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన.. ప్రజావాణిలో ఫిర్యాదు

