అక్షరటుడే, ఎల్లారెడ్డి: Congress Six Guarantees | ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయం (Yellareddy Tahsildar Office)లో వినతిపత్రం వారు అందజేశారు.
Congress Six Guarantees | తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేక చతికిలపడిపోయిందన్నారు. రైతు రుణ మాఫీ పూర్తి చేయలేదని.. రైతు పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వడం లేదన్నారు. పెళ్లి కానుకగా మహిళలకు తులం బంగారం మరిచారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదని.. యువతీయువకులు రాజీవ్ యువ వికాసం అమలు చేయట్లేదన్నారు. వృద్ధులకు వికలాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని.. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు కావట్లేదని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, పట్టణ అధ్యక్షులు అగల్ దివిటీ రాజేష్, మండల అధ్యక్షుడు పెద్దెడ్ల నర్సింలు, జనరల్ సెక్రెటరీ కుచులకంటి శంకర్, ఉపాధ్యక్షుడు వంగపల్లి కాశీనాథ్, రమేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు కుశలకంటి సతీష్, సీనియర్ నాయకులు సత్యం, యువ నాయకులు ఓలేపు రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి

