అక్షరటుడే, భీమ్గల్: Red Sorghum Farmers | రాష్ట్రంలో ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) బుధవారం శాసనసభలో ధ్వజమెత్తారు. జీరో అవర్లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాల్లో పండే ఎర్రజొన్న (ఫోడర్ జవార్) కొనుగోళ్లలో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Red Sorghum Farmers | ధర తగ్గించి నిలువునా ముంచుతున్నారు..
గత ఏడాది క్వింటాలుకు రూ.3,800 పలికిన ఎర్రజొన్న ధరను, ఈసారి సాగు విస్తీర్ణం తగ్గినా వ్యాపారులు కుమ్మక్కై రూ. 3,000కు తగ్గించారని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. దీనివల్ల రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టం వాటిల్లుతోందని, కలెక్టర్ (Collector) వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధర లభించేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం మద్దతు ధర రూ.2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రూ.1,600-1,700 కే అమ్ముకుంటూ ఎకరాకు రూ.32వేల వరకు నష్టపోతున్నారని గణాంకాలతో వివరించారు.
Red Sorghum Farmers | యూరియా కోసం యాప్ తిప్పలా?
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం వల్ల యూరియా పంపిణీలో (Urea Supply) తీవ్ర జాప్యం జరుగుతోందని వేముల మండిపడ్డారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు వాడడం రాదు. గతంలో కేసీఆర్ (KCR) హయాంలో ఆటో వాడికి డబ్బులిస్తే పొలం వద్దకే యూరియా వచ్చేది. ఇప్పుడు ఒక రైతు 4 ఎకరాల యూరియా కోసం 6 రోజుల పాటు తిరగాల్సి వస్తోంది’ అని విమర్శించారు. యూరియా స్టాక్స్ను మండల కేంద్రాల్లో కాకుండా, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి

