అక్షరటుడే, కామారెడ్డి: Threat Case Jail | కులం పేరుతో దూషించడమే కాకుండా ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలుశిక్షతో పాటు రూ.5500 జరిమానా విధిస్తూ నిజామాబాద్ (Nizamabad Court) సెకండ్ క్లాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ (ఎస్సీ,ఎస్టీ కోర్టు) శ్రీనివాస్ బుధవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Threat Case Jail | భూ వివాదంతో..
భిక్కనూరు మండలానికి చెందిన సంఘీ అర్చనకు భిక్కనూరు గ్రామ శివారులో సుమారు 6.21ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని కొనుగోలు చేయడానికి బస్వాపూర్ గ్రామానికి చెందిన వెంకన్నగారి బాగారెడ్డి విక్రయ ఒప్పందం చేసుకుని, నిర్ణయించిన గడువులో డబ్బులు చెల్లించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. అనంతరం కోర్టులో తప్పుడు కేసు వేయడంతో(Criminal Threats) పాటు, భూమిపై హక్కు పొందేందుకు వివిధ రకాలుగా ఒత్తిడి తెచ్చాడు.
Threat Case Jail | పంటను నాశనం చేసి..
ఇదే సమయంలో అర్చన తన భూమిలో వ్యవసాయ పనులు చేపట్టినప్పుడు బాగారెడ్డి అక్కడికి చేరుకొని(Telangana Crime News) అడ్డుకోవడంతో పాటు పంటను నాశనం చేశారని అర్చన ఫిర్యాదు చేసింది. బోరు బావులను చెడగొట్టడం వంటి చర్యలకు పాల్పడడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని, కులం పేరుతో దూషించి భయభ్రాంతులకు గురిచేశాడని పేర్కొంది. ఈ విషయమై 2022 అక్టోబర్ 14న అర్చన భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు (Court Verdict India) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, (Farmer Land Dispute) పరిసర ప్రాంతాల వారిని విచారించి తగిన సాక్ష్యాధారాలను సేకరించి బాగారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో సమర్పించగా బాగారెడ్డికి న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
ఇది కూడా చదవండి: Fake Paneer Seizure | మార్కెట్లో కల్తీ పన్నీరు విక్రయం.. తిన్నారంటే అంతే!

