అక్షరటుడే, కామారెడ్డి: DCC Kamareddy Leaders | జిల్లాలో పార్టీ బలోపేతం చేసే దిశగా పని చేస్తామని డీసీసీ కమిటీలో నియామకమైన నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో 84 మందితో డీసీసీ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.
DCC Kamareddy Leaders | డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా
డీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులుగా పంపరి లక్ష్మణ్, సబ్బని హరికృష్ణ నియామకమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తమపై నమ్మకంతో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. డీసీసీ కమిటీలో అవకాశం కల్పించడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, అందరినీ కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజయ్య, పంపరి శ్రీనివాస్, తాటి ప్రసాద్, జమీల్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు

