అక్షరటుడే, హైదరాబాద్: March 22 Gold Rates | కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు Silver Prices ప్రస్తుతం అదే వేగంతో పడిపోతూ మార్కెట్లో కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఈ ధరల పతనం కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మార్చి 22 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,33,800కు చేరుకుంది. వెండి ధర కూడా గణనీయంగా తగ్గి కిలోకు రూ.2.5 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. శనివారం ఒక్కరోజులోనే బంగారం ధరలు దాదాపు రూ.2,940 మేర పడిపోవడం గమనార్హం.
March 22 Gold Rates | క్రమంగా తగ్గుదల..
అలాగే వెండి ధరలు కూడా కిలోకు సుమారు రూ.10,000 వరకు తగ్గాయి. గత కొంతకాలంగా ధరల పెరుగుదలతో కొనుగోలుదారులకు అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడటంతో మార్కెట్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
ఒకవైపు కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమని భావించే వారు ఉండగా, మరోవైపు ఇంకా ధరలు పడే అవకాశం ఉందని భావించి వేచి చూస్తున్నవారూ ఉన్నారు. ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా America కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లలో తగ్గింపు ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.
March 22 Gold Rates | ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,48,580గా ఉండగా, 22 క్యారెట్ ధర రూ.1,36,200గా ఉంది.
- ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,45,970గా, 22 క్యారెట్ ధర రూ.1,33,800గా కొనసాగుతోంది.
- న్యూఢిల్లీలో New Delhi 24 క్యారెట్ ధర రూ.1,46,120గా, 22 క్యారెట్ ధర రూ.1,33,950గా ఉంది.
- వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,46,020గా, 22 క్యారెట్ ధర రూ.1,33,850గా నమోదైంది. వెండి ధరలు కూడా నగరాల వారీగా తగ్గుముఖం పట్టాయి.
- చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,50,000గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, పుణే, వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో రూ.2,45,000గా కొనసాగుతోంది.

