అక్షరటుడే, వెబ్డెస్క్ : SLBC Tunnel Works | ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనులు పున: ప్రారంభం అయ్యాయి. సొరంగం ఇన్లెట్-1 బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద సొరంగం తవ్వకాన్ని అధికారులు పున: ప్రారంభించారు. ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి పనులు మొదలు పెట్టారు. తాజాగా డ్రిల్లింగ్ ఇతర పనులు చేపడుతున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను ప్రారంభించింది. అయితే గతేడాది సొరంగంలో ప్రమాదం చోటు చేసుకొని పలువురు చనిపోయారు. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్లో ప్రమాదం జరగడంతో పనులు ఆగిపోయాయి.
SLBC Tunnel Works | 8 మంది మృతి
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు కిలోమేటర్ల మేర సొరంగం కూలిపోయింది. దీంతో అందులో చిక్కుకున్న 8 మంది చనిపోయారు. అప్పుడు నిలిచిపోయిన పనులు తాజాగా మళ్లీ ప్రారంభం అయ్యాయి.
SLBC Tunnel Works | 2028లోగా..
ఎస్ఎల్బీసీలో 9.559 కి.మీల తవ్వకం పనులు 2028 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 18న మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు పనులు ప్రారంభం కాగా.. తాజగా ఇన్లెట్-1 బ్రహ్మగిరి వద్ద డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్ (డీబీఎం) పద్ధతిలో పనులు చేపడుతున్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు

