అక్షరటుడే, వెబ్డెస్క్ : Siddipet Congress Clash | సిద్దిపేట జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు బయట పడింది. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నేతల మధ్య విభేదాలు వెలుగు చూశాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం సిద్దిపేటలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ (Oil Palm Factory)ని ప్రారంభించనున్నారు. అలాగే రైతు భరోసా విడుదల చేస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సీఎంకు స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Siddipet Congress Clash | కనిపించని ఫొటోలు
సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి (Anksha Reddy) ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఫొటో పెట్టలేదు. అలాగే హరికృష్ణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆంక్షారెడ్డి లేదు. గతంలో డీసీసీ కోసం వీరు ఇద్దరు పోటీ పడ్డారు. అయితే అధిష్టానం ఆంక్షా రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంతో హరికృష్ణ అసంతృప్తితో ఉన్నారు. ఆంక్షారెడ్డికి పదవి ఇవ్వడం హరికృష్ణతో పాటు కొందరు నేతలకు నచ్చలేదు. దీంతో వారు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఫ్లెక్సీల ఏర్పాటులో వర్గపోరు వెలుగులోకి వచ్చింది. కాగా హరికృష్ణతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు సైతం ఫ్లెక్సీలలో ఆంక్షారెడ్డి ఫొటో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన

