అక్షరటుడే, వెబ్డెస్క్ : Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA), ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Sessions) సోమవారం ఉదయం తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఉదయం బీఆర్ఎస్ నాయకులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఆందోళన చేశారు. గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Fee Reimbursement Protest | వాయిదా తీర్మానం
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక.. బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసన సభ, శాసన మండలిలో చర్చించాలని కోరారు. కాగా రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గతంలో పలుమార్లు కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటించాయి. ఈ క్రమంలో స్కాలర్షిప్, ఫీజు బకాయిలపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది.
ఇది కూడా చదవండి..: urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్రెడ్డి

