అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ASHA Workers Strike | ఆశా వర్కర్ల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ASHA Workers Strike | ఆశా కార్యకర్తలది న్యాయమైన పోరాటం..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు చేస్తున్న న్యాయమైన సమ్మెకు పూర్తి మద్దతు ఉంటుందని బిగాల స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల జీతాలను రూ.18,000కు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ASHA Workers Strike | బీఆర్ఎస్ హయాంలో జీతాల పెంపు..
మాజీ ముఖ్యమంత్రి KCR అధికారంలో ఉన్న సమయంలో ఆశావర్కర్ల జీతాలను రూ.2,200 నుంచి రూ.9,750 వరకు పెంచారని బిగాల గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి మహిళా దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లకు చీరలు, భోజనాలతో గౌరవంగా సన్మానం చేసిన విషయాన్ని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆశా వర్కర్లను పట్టించుకునే పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుజిత్సింగ్ ఠాకూర్, చింతకాయల రాజు, రంగు సీతారాం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి

