అక్షరటుడే, వెబ్డెస్క్ : Tamil Nadu NDA seats | తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఏఐడీఎంకే (AIDMK)తో బీజేపీ ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీల మధ్య సీట్ల పంపకం ఓకే అయింది.
తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఏఐడీఎంకేతో బీజేపీ (BJP), పీఎంకే, ఏఎంఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. ఏఐఏడీఎంకే భారతీయ జనతా పార్టీకి 27 సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో కంటే బీజేపీ 7 స్థానాలను అదనంగా దక్కించుకుంది. పట్టాలి మక్కల్ కచ్చి (PMK)కి 18 సీట్లు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK)కి 11 సీట్లు కేటాయించింది.
Tamil Nadu NDA seats | కొనసాగుతున్న చర్చలు
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Palaniswami) సీట్ల పంపకం వివరాలు వెల్లడించారు. ఇతర మిత్రపక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వాటిని ముగిస్తామని తెలిపారు. ఆయా పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలోని మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మాణిల కాంగ్రెస్ (మూపనార్), ఇందియ జననాయక కచ్చి (ఐజేకే) కూడా ఉన్నాయి.
Tamil Nadu NDA seats | ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకం చర్చల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ సహా కూటమి పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారు. తమిళనాడులో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఏఐడీఎంకేల మధ్య పోరు సాగే అవకాశం ఉంది. సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ సైతం పలు స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : India War Challenges | యుద్ధంతో భారత్కు సవాళ్లు.. గ్యాస్, పెట్రోల్పై మోదీ కీలక ప్రకటన

