అక్షరటుడే, వెబ్డెస్క్: Railway Ticket Cancellation | రైల్వే శాఖ (Railway Department) టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో పలుమార్పులు చేసింది. రైలు బయల్దేరే సమయం ఆధారంగా టికెట్ రిఫండ్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో నిబంధనల ప్రకారం.. 72 గంటలు ముందుగా కన్ఫామ్ టికెట్ను రద్దు చేసుకున్నట్లయితే అత్యధిక రిఫండ్ చేయనుంది. ఈ మేరకు కొత్త రూల్స్ అందుబాటులోకి తెచ్చింది.
Railway Ticket Cancellation | కొత్త నిబంధనలు ఇవే..
ప్రయాణికులు తమ టికెట్ను 72 గంటల ముందుగా రద్దు చేసుకున్నట్లయితే అత్యధిక రిఫండ్ ఇవ్వనున్నారు. అయితే ఇందులో కాన్సిలేషన్ ఛార్జీలను(Cancellation Charges) కట్ చేసి మిగతా తిరిగి ఇస్తారు.
ఇక రైలు బయలుదేరేందుకు 72 నుంచి 24 గంటల మధ్యలో టికెట్ను క్యాన్సిల్ (Ticket Cancel) చేసుకున్నట్లయితే పెనాల్టీ విధించనున్నారు. మొత్తం టికెట్ రేటులో 25 శాత్ కట్ చేసి మిగిలిన సొమ్మును తిరిగి రిఫండ్ ఇస్తారు.
24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. 50 శాతం కట్ చేసి మిగతా మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
అదే రైలు ప్రయాణానికి కేవలం 8 గంటల ముందు లేదా ట్రెయిన్ స్టార్ట్ అయ్యాక టికెట్ రద్దు చేసినట్లయితే ఎలాంటి రిఫండ్ రాదు.
Railway Ticket Cancellation | బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు..
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ మరో నిబంధన తెచ్చింది. ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ను మార్చుకునే వెలుసుబాటును అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో ఉన్న వారికి ఈ సదుపాయం ఉపయోగపడనుంది.
ఇది కూడా చదవండి..: India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!

