అక్షరటుడే, వెబ్డెస్క్: Modi Preparedness Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లడారు.
ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ ప్రభావం, దానివల్ల భారతదేశానికి ఎదురైన సవాళ్లపై పౌరుల ఆందోళనలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు (State Government) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో కఠినమైన పర్యవేక్షణ, తక్షణ చర్యలు అవసరమని ఆయన అన్నారు.
Modi Preparedness Warning | యుద్ధంతో తీవ్ర ప్రభావం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై చాలా కాలం ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా, ఆర్థిక వృద్ధిని కొనసాగించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశానికి ఆత్మనిర్భరత సాధించడం తప్ప మరో మార్గం లేదన్నారు. గత 11 ఏళ్లలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంపై పనులు కొనసాగుతున్నాయని ప్రకటించారు.
Modi Preparedness Warning | ఒక్కటిగా పని చేయాలి
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమ్ ఇండియా’ (Team India)గా ఒక్కటిగా పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు. సరఫరా గొలుసు, పెట్రోల్, డీజిల్, ఎరువులు, గ్యాస్, ద్రవ్యోల్బణంతో సహా యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు.
ఇది కూడా చదవండి..: Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్లో మార్పులు..

