అక్షరటుడే, వెబ్డెస్క్: Chicken Shops Bandh | చికెన్ షాపుల నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరనసగా ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు బంద్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Chicken Shop Owners Association) పేరిట హైదరాబాద్ నగరంలో పోస్టర్లు అంటించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో చికెన్ షాపుల ఓనర్లు పోస్టర్లు అంటించారు. ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు మూసి వేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము నష్టపోతున్నామని తెలిపారు. తగ్గించిన మార్జిన్ను పెంచే వరకు దుకాణాలు తెరవబోమన్నారు.
Chicken Shops Bandh | రూ.20 తగ్గింపు
పౌల్ట్రీ కంపెనీ (Poultry Company)ల తీరుపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్జిన్ సరిపోవడం లేదని పేర్కొంది. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే రూ.20 తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసింది. రోజు రోజుకు చికెన్ రేట్లు పెరుగుతున్నా.. మార్జిన్ మాత్రం తగ్గిస్తున్నారని తెలిపింది. మార్జిన్ పెంచకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించింది.
Chicken Shops Bandh | భారీగా పెరిగిన చికెన్ రేట్లు
రాష్ట్రంలో ఇటీవల చికెన్ ధరలు (Chicken Prices) భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.360 నుంచి రూ.400 వరకు ఉంది. వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల చికెన్ షాపుల నిర్వాహకులు పేపర్ రేట్ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఎండలు మండుతుండటంతో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో రేట్లు పెరుగుతున్నాయని సమాచారం.
ఇది కూడా చదవండి..: Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

