అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Bribery Arrest | అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నా.. లంచాలు తీసుకోవడం ఆపడం లేదు.
రాష్ట్రంలో పలు శాఖల్లో అవినీతి భారీగా పెరిగింది. పలువురు కింది స్థాయి ఉద్యోగుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా ఓ హోంగార్డు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు.
ACB Bribery Arrest | పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ (Keesara Police Station)లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఠాణాలో పనిచేస్తున్న హోంగార్డు నగేశ్ పోస్టుమార్టం (Postmortem) రిపోర్టు కోసం రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు నుంచి రూ.35 వేలు తీసుకుంటుండగా.. హోంగార్డును ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సోదాలు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం కూడా లంచం డిమాండ్ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ACB Bribery Arrest | లంచం ఇవ్వొద్దు
లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కు డయల్ చేయాలని, లేదా ఏసీబీ వెబ్సైట్, వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

