అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Catches SI | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేస్తూ.. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. తాజాగా లంచం తీసుకుంటున్న ఇద్దరు ఎస్సైలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అవినీతి అధికారులు మారడం లేదు. పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. అంతేకాకుండా.. డబ్బులు తీసుకొని పలువురు అక్రమార్కులకు సహకరిస్తున్నారు. తాజాగా సైబర్ క్రైం (Cyber Crime) కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఇద్దరు ఎస్సైలు లంచం డిమాండ్ చేశారు. మల్కాగిజిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ (LB Nagar) సైబర్క్రైం పోలీసు స్టేషన్కు చెందిన ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ సోమవారం రూ.లక్ష లంచం తీసుకుంటుండంగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ACB Catches SI | రిమాండ్కు తరలింపు
సైబర్ క్రైం కేసులో అరెస్టుకు బదులుగా సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేయడానికి ఎస్సైలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తులు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.

ACB Catches SI | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

