అక్షరటుడే, వెబ్డెస్క్: Air India Plane Accident | ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా (Air India) ఎక్స్ప్రెస్ విమానం బుధవారం థాయిలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ చేసింది.
దీంతో దాని నోస్ గేర్కు గణనీయమైన నష్టం వాటిల్లింది. ఈ ఘటన తర్వాత విమానాశ్రయ అధికారులు స్థానిక సమయం సాయంత్రం 6 గంటల వరకు రన్వేను మూసివేస్తున్నట్లు NOTAM (ఎయిర్ మిషన్కు నోటీసు) జారీ చేశారు.
బోయింగ్ 737 MAX 8 విమానం హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ (Thailand) బయలు దేరింది. ఫ్లైట్లో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి సురక్షితంగా తరలించారు. విమానం ల్యాండింగ్ చేస్తున్నప్పుడు సమస్య ఎదురైందని, నోస్ ల్యాండింగ్ గేర్ విరిగిపోయి విమానం రన్వే వెంట జారీపోయిందని అధికారులు తెలిపారు. విమానాన్ని క్లియర్ చేయడానికి, భద్రతా తనిఖీలను నిర్వహించడానికి రన్వే మూసివేశారు.
Air India Plane Accident | కీలక భాగం
నోస్ వీల్ అనేది విమానం ల్యాండింగ్ గేర్లో కీలకమైన భాగం. ఇది టాక్సీ, టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానం ముందు భాగాన్ని స్టీరింగ్ చేయడానికి మద్దతు ఇస్తుంది. విమానంలోని ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, 133 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kadiyam Srihari Challenge | కేసీఆర్ క్షమాపణ చెబితే రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి

