అక్షరటుడే, వెబ్డెస్క్: Alipiri Walkers Protest | తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కపిల తీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై వాకర్లు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది.
Alipiri Walkers Protest | ప్రవేశ రుసుముపై వివాదం
అలిపిరి సమీపంలోని దివ్యరామంలో ఉన్న నగరవనంలో వాకింగ్ చేసేందుకు అటవీశాఖ అధికారులు (Forest Officers) నెలకు రూ.100 ప్రవేశ రుసుము చెల్లించాలని కొత్త నిబంధన అమలు చేశారు. ఈరోజు ఉదయం రుసుము చెల్లించని వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన వాకర్లు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. డీఎఫ్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు వాకర్స్ సంఘంలోని సీపీఎం నాయకులు (CPM Leaders) ముందుండి నాయకత్వం వహించారు.
తిరుమల వెళ్లే మార్గం కావడంతో వాహనాల్లో ఉన్న భక్తులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొంతసేపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉదయం వేళలో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలుసుకున్న అలిపిరి సీఐ రామకిశోర్ (CI Ramkishore) వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఫీజు అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వాకర్లు తమ నిరసనను విరమించారు.
అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పరిస్థితి క్రమంగా సాధారణమైంది.నగరవనం ప్రవేశ రుసుము అంశంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి..: Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లు ఫుల్..

