అక్షరటుడే, ఆర్మూర్: Alur Gutpa Road | ఆలూర్ నుంచి గుత్ప వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆలూరు మండల రైతు వేదికలో గురువారం కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
Alur Gutpa Road | బైపాస్ కూడా అవసరమే..
రైతు వేదికలో 37మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, మూడు షాదీ ముబారక్ చెక్కులను (Shaadi Mubarak cheques) అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుత్ప నుంచి ఆలూర్కు డబుల్ లైన్ రోడ్డు, కల్లెడ నుంచి ఆలూర్కు, ఆలూర్ గుత్పకు డబుల్ లైన్ రోడ్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే ఆలూరు గ్రామానికి బైపాస్ రోడ్డు కూడా అవసరమని గ్రామస్థులందరి ఏకాభిప్రాయంతో రోడ్డుకు చొరవ చూడాలన్నారు. రోడ్డుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆలూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో మండల ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు సూర శ్రీకాంత్, కల్లెడ సర్పంచ్ సుస్మిత, మచ్చర్ల సర్పంచ్ కట్ట నర్సయ్య, హరీష్, మల్లయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Cow Protection Movement | గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం: ఎమ్మెల్యే ధన్పాల్
