అక్షరటుడే, ఆర్మూర్: Alur House Theft | ఆలూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఏకంగా పది తులాల వరకు బంగారం, నగదు చోరీ (Gold Theft India) చేశారు. దీంతో ఆలూర్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Alur House Theft | తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న(House Burglary) దుండగులు, ఇంట్లోని బీరువాలను పగులగొట్టి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదును అపహరించారు. గ్రామానికి చెందిన తలారి జమున ఈనెల 15న సాయంత్రం తన ఇంటికి తాళం వేసి జుక్కల్లో నివసిస్తున్న తన చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు అనుమానం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Alur House Theft | చిందరవందరగా వస్తువులు..
సమాచారం అందుకున్న జమున కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకుని ఇంటిని పరిశీలించగా, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా (Telangana Crime News) కనిపించాయి. దుండగులు బీరువాలను పగులగొట్టి అందులో దాచిన బంగారు ఆభరణాలు, (Nizamabad Crime) నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అపహరించబడిన బంగారంలో మూడు తులాల తీగ, సుమారు రెండున్నర తులాల నెక్లెస్, రెండున్నర తులాల పుస్తెల తాడు, రెండు తులాల బంగారు గాజులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఆర్మూర్ సీఐ సత్యనారాయణ (Telangana Crime) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

