అక్షరటుడే, వెబ్డెస్క్ : Amanagallu Incident | నల్గొండ జిల్లా (Nalgonda District)లోని ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అగ్ని గుండంలో నుంచి వెళ్తున్న భక్తులు అందులో పడిపోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం (Vemulapalli Mandal) ఆమనగల్లులో పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారు జామున అగ్ని గుండాలు నిర్వహించారు. భక్తులు స్వామి వారి పల్లకిని తీసుకొని అగ్నిగుండంలో నుంచి వెళ్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకేసారి భారీగా భక్తులు పరుగెత్తడంతో పలువురు అగ్ని గుండంలో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మిగతా భక్తులు, పోలీసులు వారిని బయటకు తీశారు.
Amanagallu Incident | నెట్టుకోవడంతో..

పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం (Parvati Ramalingeswara Swamy Temple)లో ప్రతి ఏటా మహాశివరాత్రి అనంతరం పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామి కల్యాణం అనంతరం అగ్నిగుండాలు నిర్వహిస్తారు. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒకరినొకరు నెట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు.
ఇది కూడా చదవండి..: March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం
భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట
ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు
నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు… pic.twitter.com/o13OtzrFfP
— Telugu Feed (@Telugufeedsite) March 4, 2026

