అక్షరటుడే, వెబ్డెస్క్: Andhra Pradesh New Map | ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) కొత్త మ్యాప్ను రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తాజాగా విడుదల చేశారు. అమరావతి రాజధానిగా 28 జిల్లాలతో మ్యాప్ రూపొందించారు.
ఏపీ రాజధాని అమరావతి (Amaravati)కి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. అమరావతి బిల్లుకు లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త మ్యాప్ (New Map) విడుదల చేయడం గమనార్హం. అందులో అమరావతిని రాజధానిగా చేర్చింది. రాష్ట్రంలో గతంలో 26 జిల్లాలు ఉండగా.. తాజాగా పోలవరం, మార్కాపురంను సైతం జిల్లాలుగా పేర్కంది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది.
Andhra Pradesh New Map | అభివృద్ధి వికేంద్రీకరణ కోసం..
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసింది. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల (Eluru District) నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి..: Family Suicide Attempt | కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
