అక్షరటుడే, వెబ్డెస్క్: Anganwadi Breakfast Scheme | అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) శనివారం ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అల్పాహారం అందించడానికి ప్రభుత్వం తొలి ముద్ద పేరిట పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని సీఎం అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం అందించాలని సీఎం అన్నారు. దేశంలో ఆహారానికి ఇబ్బంది లేదన్నారు. అయితే పౌష్టికాహారం అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల (Anganwadi Centers) ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అంగన్వాడీ టీచర్లు సక్రమంగా అమలు చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చే పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఆదేశించారు.
Anganwadi Breakfast Scheme | సమస్యలు పరిష్కరిస్తాం
అంగన్వాడీ సిబ్బంది (Anganwadi Staff) సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిపై గురుతర బాధ్యత పెట్టిందన్నారు. పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Mining Action | అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలి : హరీశ్రావు

