అక్షరటుడే, వెబ్డెస్క్ : Anganwadi Half Day | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో సైతం ఒంటిపూట అమలు చేయాలని ఆదేశించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు (Half Day Schools) అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండలు మండుతుండటంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బడులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్ష (SSC Exams) కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. అయితే పాఠశాలల తరహాలనే అంగన్వాడీ కేంద్రాల్లో సైతం ఒంటిపూట అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Anganwadi Half Day | ఏప్రిల్ 23 వరకు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండల ధాటికి పాఠశాల విద్యార్థులే తట్టుకోలేరు. అంతకంటే తక్కువ వయసు ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రతి వేసవిలో తమకు కూడా ఒంటిపూట అమలు చేయలని అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు. ఈ క్రమంలో గతేడాది నుంచి ఒంటిపూట అమలు చేస్తున్నారు.
ఈ సంవత్సరం కూడా సోమవారం నుంచి ఒక్క పూట అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట కొనసాగనున్నాయి. ఆ తర్వాత వేసవి సెలవులపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. టేక్ హోం రేషన్ (Take Home Ration) ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ కొనసాగించనున్నారు. సమయం కుదించినప్పటికీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీనిని కూడా చదవండి : Drug Test Challenge | కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్కు రావాలి.. పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సవాల్

