అక్షరటుడే, వెబ్డెస్క్ : Annaram Barrage Controversy | మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని విమర్శించారు.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ (BRS)పై బురదజల్లే పన్నాగాలపై విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)ను దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ అరాచకాలు చేస్తోందన్నారు.
Annaram Barrage Controversy | ఇసుక మాఫియా
అన్నారం బ్యారేజి (Annaram Barrage) పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్ర అని ఆరోపించారు. పట్టపగలే అన్నారం బ్యారేజ్ నుంచి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా (Sand Mafia) ఇసుకను తోడేస్తుందన్నారు. బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని పేర్కొన్నారు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
ఇది కూడా చదవండి..: Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్

