అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Group 1 Case | ఆంధ్రప్రదేశ్ 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో షాక్ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది.
ఏపీలో 2018లో గ్రూప్–1 నియామకాలు జరిగాయి. పలువురు ఉద్యోగాలు సాధించి విధులు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షల పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయగా.. అక్రమాలపై దర్యాప్తు సాగుతోంది.
AP Group 1 Case | బదిలీ చేయాలని..
కేసు విచారణ ముగిసే వరకు 2018 బ్యాచ్ గ్రూప్–1 ఉద్యోగులను ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. 2018 గ్రూప్ 1 పరీక్షలో ఉద్యోగాలు పొంది కీలక శాఖల్లో పని చేస్తున్న వారి అప్రాధాన్య పోస్టుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది.
AP Group 1 Case | సుప్రీంకోర్టులో అప్పీలు
డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. అధికారులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగాలు చేయలేరా అని ప్రశ్నించింది. ఎక్కడున్నా జీతం వస్తుందని, సంతృప్తి పడాలని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

