అక్షరటుడే, వెబ్డెస్క్ : Artificial Mango Ripening | హైదరాబాద్ (Hyderabad)లో మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే అసలు కొనరు. నగరంలో కల్తీ మఫియా ఆఖరకు మామిడి పండ్లను కూడా వదలడం లేదు.
హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో ఉన్న ఒక పండ్ల గిడ్డంగిపై హెచ్-ఫాస్ట్ అధికారులు (H-FAST Officials) దాడి చేశారు. ఈ దాడిలో ఇథిలీన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడిపండ్లను కృత్రిమంగా పండిస్తున్నట్లు గుర్తించారు. బటసింగారం మార్కెట్ నుంచి తెచ్చిన సుమారు 7 టన్నుల మామిడిపండ్లను స్వాధీనం చేసుకున్నారు.
Artificial Mango Ripening | కఠిన చర్యలు
భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, ఈ పండ్లను 350 ట్రేలలో నిల్వ చేసి మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Artificial Mango Ripening | గోషామహల్లో..
గోషామహల్ (Goshamahal)లో రసాయనికంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లు (Mangoes) స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని గోషామహల్లో అధిక మోతాదులో “డైమండ్ రైప్” ఇథిలీన్ రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా పండించిన సుమారు 200 కిలోల మామిడి పండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్దేశించిన భద్రతా పరిమితులను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్దేశించిన ఐదు సాచెట్ల పరిమితిని మించి, వ్యాపారి ప్రతి 20 కిలోల ట్రేకు ఆరు సాచెట్లను ఉపయోగించారని అధికారులు తెలిపారు. ఇలా పండించిన మామిడి పండ్లతో వాంతులు, విరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: KPHB Minor Theft Case | పీహెచ్బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్
