అక్షరటుడే, కామారెడ్డి: విద్యుత్ శాఖ (Electricity Department)లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏఈపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్తో (AEPSEB Service Rules) పాటు కన్వర్షన్ ఇవ్వాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి విద్యుత్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజు కొనసాగింది.
Artisan Workers Demand | అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్మ్యాన్డ్ కార్మికులను (Unmanned workers) టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ తరహాలో ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలన్నారు. పీస్రేట్ వర్క్లకు జీవో 11 ప్రకారం వేతనాలు వర్తింపజేయాలని (Artisan Workers Demand) డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ హరికృష్ణ, కామారెడ్డి జిల్లా (Kamareddy District)జేఏసీ కో ఛైర్మన్ బెమ్రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టాగౌడ్, కామారెడ్డి జిల్లా జేఏసీ కన్వీనర్ జయసింహారెడ్డి, కామారెడ్డి డివిజన్ జేఏసీ ఛైర్మన్ సునీల్ గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్, స్వామి, సీఎల్ అన్మ్యాన్డ్ కార్మికులు రవి, నితిన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ganja Ban Velpur | గంజాయిపై సమరశంఖం.. విక్రయిస్తే జరిమానా విధించేందుకు వేల్పూర్లో తీర్మానం
