అక్షరటుడే, బాన్సువాడ: ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల పాటు సబ్ కలెక్టర్ కార్యాలయం (Sub-Collector Office) ముందు వంటావార్పు కార్యక్రమంతో ధర్నా నిర్వహించారు.
ASHA Workers Protest | ఎన్నికల్లో హామీలిచ్చి మరిచారు..
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు (CITU Leaders) జై రవీందర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆశ వర్కర్లకు రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) ఆశ వర్కర్ల సమస్యలను చర్చించి పరిష్కరించాలని సీఐటీయూ తరపున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు ప్రకటించకపోతే ఈనెల 23న మంత్రుల ఇళ్ల ముట్టడి, 28న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లవి, పద్మ, బీర్కూర్ శోభ, స్వరూప, లావణ్య, మహానంద, నస్రిన్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Municipal Workers Protest | మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి.. సొమ్మసిల్లిన పలువురు కార్మికులు

